జెండాలను ఎగరవేసిన సర్పంచ్ మోహన్ రావు
Published: Monday May 02, 2022
తల్లాడ, మే 1 (ప్రజాపాలన న్యూస్): కార్మికుల హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ పోరాటాలు చేయాలని సీపీఎం నాయకులు, గోపాలపేట గ్రామ సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా ఆదివారం తల్లాడ మండలంలోని అన్నారుగూడెం, గోపాలపేట, నరసింహారావు పేట గ్రామాల్లో ఆయన ఎర్రజండాను ఎగరవేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కార్మికుడికి పనికి తగ్గ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అన్ని వర్గాల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తుందని, ఆ పోరాటాల ఫలితమే ప్రభుత్వాలు దిగొచ్చి పథకాలు అమలు చేస్తున్నాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గుంటుపల్లి వెంకటయ్య, గురజాల వెంకటేశ్వర్లు, ఎస్ వి రాఘవులు, పేరసాని వెంకటయ్య, తుమ్మలపల్లి వెంకటయ్య, తుమ్మలపల్లి లక్ష్మయ్య, సూదా హనుమంతరావు, శివలంక వెంకట నరసయ్య, శనక్కాయల నరసింహారావు, సుంకర కృష్ణ రావు, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: