వీరశైవ సమాజానికి ఎల్లవేళలా అండగా ఉంటా

Published: Monday September 26, 2022
ఎంపి బిబి పాటిల్
వికారాబాద్ బ్యూరో 25 సెప్టెంబర్ ప్రజా పాలన : వీరశైవసమాజ అభివృధ్ధికి శాయశక్తులా తన వంతు కృషిచేస్తానని ఎంపి బిబి పాటిల్ అన్నారు. ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నెపల్లిలో జిల్లా వీరశైవ సంఘం అధ్యక్షుడు కోస్గి విజయకుమార్ ( అప్పా ) ఆధ్వర్యంలో  ఏర్పాటుచేసిన బసవేశ్వర పూజాకార్యక్రమంలో వీరశైవ సమాజం రాష్ట్ర నాయకులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2న హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే "బసవభవన్" శంకుస్థాపన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వీరశైవ బంధువులు హాజరుకావాలని కోరారు. ఎన్నెపల్లిలోని వికారాబాద్ వీరశైవసమాజం బసవేశ్వర విద్యాసంస్థ స్థలంలో భవన నిర్మాణానికి తనవంతు సాయంగా ముందుగానే 5 లక్షలు రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చారు. 
ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కోస్గి విజయ్ కుమార్ ( అప్ప ) కార్యవర్గం బిసి కమీషన్ సభ్యులు  నూలి శుభప్రద్ పటేల్, మార్కెట్ కమిటి అధ్యక్షులు డాక్టర్ ముద్ద దీప భక్తవత్సలం, వీరశైవ సమాజం పెద్దలు బస్వరాజు,ఆత్మలింగం, కోటిగారి శివరాజు,  విద్యాసాగర్, కౌన్సిలర్లు మల్లేపల్లి నవీన్, నూలి సుధాంశ్ కిరణ్ పటేల్, వికారాబాద్ వీరశైవ సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area