వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా డిఆర్డిఏ శేషాద్రి

Published: Saturday December 03, 2022
జన్నారం, నవంబర్ 02, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని డి ఆర్ డి ఎ, ఐ కె పి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు.
మొర్రిగూడ, దేవునిగూడ, కవ్వల్ హాస్టల్ తండా
సెంటర్లను శుక్రవారం మంచిర్యాల జిల్లా డి ఆర్ డి ఓ, బి శేషాద్రి తనిఖీ చేయడం జరిగింది.  ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ట్రాన్స్పోర్టింగ్, తేమ శాతం, సెంటర్ నిర్వహణ తదితర అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎం మార్కెటింగ్ వేణు గోపాల్, మండల ఏపీఎం సిహెచ్ బుచ్చన్న,  సెంటర్లకు సంబంధించిన సెంటర్ ఇంచార్జ్ లు, బుక్ కీపర్స్, కమిటీ మెంబర్స్. రైతులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని మర్రిగూడ దేవుని గూడా కిష్టాపూర్ గ్రామపంచాయతీలోని తెలంగాణ క్రీడా ప్రాంగణములను నర్సరీలను పల్లె ప్రకృతి వనాలను మంచిర్యాల జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బి శేషాద్రి సందర్శించారు.