ఆముదాలపల్లిలో ఈనెల 30న అంబేద్కర్ విగ్రహావిష్కరణ శంకరపట్నం మార్చి 29 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Thursday March 30, 2023
శంకరపట్నం మండలం ఆముదాలపల్లిలో ఈనెల 30న గ్రామంలోని అంబేద్కర్ కమిటి హాల్ వద్ద ప్రతిష్టించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  నూతన విగ్రహ ఆవిష్కరణ జరుగునున్నట్లు గ్రామ సర్పంచ్ బత్తుల మానస తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు సర్పంచ్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి  స్థానిక ఎంపిపి, జెడ్పిటీసి, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపిటీసీలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, ఉపసర్పంచులు, రైతు సమన్వయ సమితి మండల గ్రామ సమన్వయ కర్తలు, సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు,  ఆయా గ్రామాలకు చెందిన దళిత సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ వాదులు అందరూ హాజరుకావాలని  తెలియజేశారు.