ఆర్థిక సాయం అందజేత

Published: Thursday September 30, 2021

వలిగొండ, సెప్టెంబర్ 29, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని మల్లేపల్లికి గ్రామానికి చెందిన మాజీ గ్రంధాలయ ఛైర్మన్ పల్లెర్ల ప్రకాష్ ఇటీవలే ప్రమాదానికి గురై హాస్పటల్ లో చికిత్స పొందుతున్న సందర్భంగా మిత్రులు బుధవారం టిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు మన్నెం ప్రకాష్ రెడ్డి, ఆజం, ఆలకుంట్ల రాజు, ఖాజా, ప్రమోద్, కుమార్ కలిసి 5వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో సుధాకర్, నర్సింహ, మల్లేషం తదితరులు పాల్గొన్నారు.