భక్తిశ్రద్ధలతో సాయి మండల పూజ ** శోభయాత్రలో పాల్గొన్న దీక్షాపరులు, భక్తులు **
Published: Saturday December 03, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 02 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలో సాయిబాబా దీక్షాపరులు శుక్రవారం శోభా యాత్ర నిర్వహించారు. ఆసిఫాబాద్ లోని జన్కా పూర్ రామాలయం నుంచి శోభాయాత్ర ప్రారంభించగా, సాయి నామస్మరణతో పట్టణమంతా సాయిదీక్షాపరులతో శోభాయాత్ర మార్మోగింది. అంతకు ముందు రామాలయంలో వేద పండితుడు ఇందారపు మధుకర్ శర్మ, ఆర్చ కుడు వినాయక్ ఆధ్వర్యంలో గణపతి పూజ, సాయి బాబా విగ్రహానికి అభిషేకం, పుష్పాభిషేకం పూర్ణహవుతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్వాములు తిరుపతి, సునీల్, వెంకటేష్ , చిప్ప సురేష్, శ్రీనివాస్, రమేష్, మహేష్ ,భక్తులు సిరిపుర భద్రయ్య, రవికాంత్ ,శశి, రవి ,గిరి, సత్యనారాయణ ,పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Share this on your social network: