స్వయం సహాయక సంఘాలు అభివృద్ధి చెందాలి ** డీసీఎంఎస్, వైస్ చైర్మన్ **

Published: Tuesday September 06, 2022

ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 05 (ప్రజాపాలన, ప్రతినిధి) : స్వయం సహాయక సంఘాలు బ్యాంక్ రుణాలు తీసుకుని అభివృద్ధి చెందాలని డిసిఎంఎస్, వైస్ చైర్మన్ మంతయ్య అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సహకార బ్యాంకులో కాప్రీ, మంకపూర్, గ్రామాలలోని స్వయం సహాయక సంఘాలకు రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార బ్యాంకు ద్వారా వివిధ రుణాలను అందజేస్తున్నామని వాటిని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బ్యాంకు రుణాలు తీసుకున్నవారు వాటిని సకాలంలో తిరిగి చెల్లించాలని అన్నారు. ఈయన వెంట సింగిల్విండో చైర్మన్ అలీ బిన్ అమ్మద్, బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.