సొసైటీ అధ్యక్షుడుకటికల సీతారామిరెడ్డిరైతుకు ట్రాక్టర్ రుణం మంజూరు

Published: Friday November 26, 2021
మధిర నవంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి : సిద్దినేనిగూడెం సొసైటీ పరిధిలోని నాగవరప్పాడు గ్రామానికి చెందిన మోరబోయిన కిషోర్ అనే రైతుకు 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ ట్రాక్టర్ ను మంజూరు చేయడం జరిగిందని సొసైటీ అధ్యక్షులు కటికల సీతారామరెడ్డి తెలిపారు. ఈరోజు సొసైటీ అధ్యక్షులు చేతుల మీదగా రైతుకు ట్రాక్టర్ తాళాలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సొసైటీ పరిధిలోని అర్హత కలిగిన రైతులు ప్రతి ఇ ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి సి సి బి మేనేజర్ అత్తులూరి మధులిక, సొసైటీ వైస్ ప్రెసిడెంట్ తాటి సురేష్, సొసైటీ డైరెక్టర్ లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.