ఆపదలో ఉన్న రోగికి రక్తదానం చేసిన డా. శైలెంధర్ రెడ్డి

Published: Friday September 09, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 08 ( ప్రజాపాలన ప్రతినిధి): స్థానిక జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సారంగాపూర్ మం. రేచపల్లి గ్రామ సమీపంలో ఉన్న లచ్చనాయక్ తండాకు చెందిన గుగులోతు రమేష్ తీవ్ర అనారోగ్య కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వగా పరీక్షించిన వైద్యులు డెంగ్యూ కారణంగా ప్లేట్ లెట్స్ రక్తకాణాలు పడి పోవడంతో ఓ పాజిటివ్ ప్లేట్ లెట్స్ రక్త కణాలు అవసరం ఉండగా రమేష్ అనే వ్యక్తికి వెనుక ముందు ఎవరు లేకపోవడంతో ఆసుపత్రి సూపరిండెంట్ సమాచారంతో విషయం తెలుసుకున్న జగిత్యాల నియోజకవర్గ బీజేపీ నాయకుడు డా. ఎడమల శైలెందర్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్, మరియు పెషేంట్ తో మాట్లాడి ప్రభుత్వ ఆసుపత్రిలో గల బ్లడ్ బ్యాంకు రక్తనిధికి వెళ్లి ప్లేట్ లెట్స్ ఇచ్చారు. తక్షణ సహాయం కింద పెషేంట్ కు ఖర్చుల నిమిత్తం నగదు కూడా ఆర్థిక సహాయం చేశారు. రక్తదానంతో పాటు ఆర్థిక సహాయం అందజేసిన డా. శైలెందర్ రెడ్డిని జగిత్యాల జిల్లా బ్లడ్ బ్యాంకు సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది, జగిత్యాల జిల్లా బీజేపీ శ్రేణులు అభినందించారు. తధానంతరం డాక్టర్ శైలెందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతు అత్యవసర పరిస్థితులలో యువత వెంటనే స్పందించి రక్తదానం చేయండి యువత చరిత్రలో ప్రాణదాతలుగా నిలవండని ఆయన యువతకు పిలుపు ఇచ్చారు.