దుబ్బరాజన్న దేవస్థానం వుండీ లెక్కింపు...

Published: Tuesday October 05, 2021
సారంగాపూర్, అక్టోబర్ 04 (ప్రజాపాలన ప్రతినిధి) సారంగాపూర్ మండల్ పెంబట్ల శ్రీ దుబ్బ రాజేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం రోజున  వుండీ లెక్కించగా  10,52,289 రూపాయలు మిశ్రమ బంగారం పదకొండు గ్రాముల ఆరువందల మిల్లీ గ్రాములు మిశ్రమ వెండి రెండు కిలోల ఎడు వందల యాబై గ్రాముల వచ్చినట్లు ఈఓ కాంతారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త పోరండ్ల శంకరయ్య రెనవేశన్ కమిటి పరిశీలకులు రంగు రవికిషన్ సర్పంచులు బొడ్డుపెల్లి రాజన్న కొనపూర్ సర్పంచ్ ఆకుల జమున పోచంపేట్ సర్పంచ్ రవి సర్పంచ్ పోచంపెట కమిటి సభ్యులు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులు సారంగాపూర్ పోలీస్ సిబ్బంది సత్యసాయి సేవా సమితి వారు పాల్గొన్నారని తెలిపారు