పోడు భూముల సమస్యను పరిష్కరించాలి

Published: Tuesday August 03, 2021

సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జూలై 02 (ప్రజాపాలన) : మండలంలోని రవుటసంకె పెళ్లి, ఎడవెల్లి, పర్శనంబాల, అప్ప పెళ్లి, తదితర గ్రామాలలోని పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 4వ తేదీ న సిపిఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు కొనసాగే పోడు యాత్రను జయప్రదం చేయాలని ఇట్టి ర్యాలీని ఆసిఫాబాద్ లో నిర్వహించడం జరుగుతుందని పిలుపునిచ్చారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని, పోడు రైతుల పై అటవీశాఖ, పోలీస్ అధికారులు దాడులను ఎత్తివేయాలని, పోడు రైతులకు బ్యాంకులో వడ్డీలేని రుణాలను భేషరతుగా ఇప్పించాలని, రైతు బంధు, రైతు బీమా, పథకం రైతులందరికీ వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోగుల సుశీల, నాయకులు జాడి గణేష్, ఎఐవైఎఫ్ జిల్లా నాయకులు ఆత్మకూరు చిరంజీవి, హనుమంతు, మల్లికార్జున్, అచ్యుతరావు, తదితరులు పాల్గొన్నారు.