మహిళలను కించపరిస్తే ఊరుకునేది లేదు ఐద్వ మహిళ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు పోతు విజయశ

Published: Friday November 25, 2022

జన్నారం  నవంబర్ 24, ప్రజాపాలన: మహిళలను కించపరిస్తే ఊరుకునేది లేదని పలు రంగాలలో విధులు నిర్వహిస్తున్న మహిళలకు పురుషులతో సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని గురువారం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు పోతు విజయశంకర్ (సిపిఎం) కోరారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మాట్లాడుతూ పలు రంగాలలో పురుషులతో సమానంగా మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. చట్టం ప్రకారం పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు చెల్లించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. ప్రభుత్వం పురుషులతో సమానంగా వేతనాలు చెల్లించే విధంగా చూడాలని ఆమె కోరారు. అదేవిధంగా వివిధ రకాలైన లబ్ధిదారులు బయోమెట్రిక్ లో వేలిముద్రలు పడని ఆసరా పెన్షన్ దారులకు ప్రత్యామ్నాయ పద్ధతిలో పెన్షన్ డబ్బులు ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల్లో చాలామంది లబ్ధిదారుల వేలిముద్రలు బయోమెట్రిక్ లో పడక సరైన సమయంలో పెన్షన్ ఆసరా పెన్షన్ డబ్బులు రావడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పేద లబ్ధిదారుల వారికి ఆధార్ కార్డు, తదితర విధానాల ఆధారాలు తీసుకొని పెన్షన్ డబ్బులు అందించాలన్నారు.