సైన్స్ కేంద్రం ఆవరణలో ముక్కలు నాటిన జిల్లా యువజన క్రీడా శాఖ

Published: Thursday February 18, 2021

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, పిబ్రవరి17, ప్రజాపాలన: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం పురస్కరించుకొని సైన్స్ కేంద్రం ఆవరణలో బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 29వ వార్డు కౌన్సిలర్ చైతన్య సత్యపాల్ రెడ్డి, జిల్లా వయోజన విద్యా శాఖ అధికారి పురుషోత్తం నాయక్, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, వాలీ బాల్ అసోసియేషన్ సెక్రెటరీ శ్రీనివాస్, యువతరం యూత్ అసోసియేషన్ తిరుపతి, యువకులు, క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.