సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త భాగస్వాములు కావాలి

Published: Monday February 22, 2021

మధిర ఫిబ్రవరి 21: సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త భాగస్వాములు కావాలని 21 వ వార్డు కౌన్సిలర్ ఎర్రగుంట లక్ష్మి రమేష్ కోరారు. ఆదివారం మధిర మున్సిపాలిటీలో 21 వ వార్డులో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త భాగస్వాములై సభ్యత్వ నమోదును పూర్తి చేయాలన్నారు. టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం వాడవాడలా విస్తరించేలా పార్టీ పటిష్టత కోసం టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేయించే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా నిర్వహించాలని ఆమె సూచించారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు ఏదైనా ప్రమాదం జరిగితే రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ నాయకులు ఎర్రగుంట రమేష్ నరసింహారావు వేల్పుల శివ తదితరులు పాల్గొన్నారు.