చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలు మూసివేత

Published: Wednesday November 09, 2022

 

పాలేరు నవంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి
నేలకొండపల్లి
చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మండలం లోని వివిధ గ్రామల్లో ఆలయాలు మూసివేశారు. శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం ను పూజారి తుపురాణి మధుసూధనాచార్యులు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆలయ ప్రధాన ద్వారం, గేట్లు ను మూసివేశారు. అదే విధంగా శ్రీ ఉత్తరేశ్వరస్వామి దేవాలయం ను చైర్మన్ కురాకుల నాగేశ్వరరావు, పూజారి ముడండ రామానుజాచార్యులు ఆధ్వర్యంలో మూసివేశారు. శ్రీ ఉత్తరేశ్వరస్వామి దేవాలయం పూజారి కొడవటిగంటి శివయ్య, శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయం ను చైర్మన్ బాజా నాగేశ్వరరావు, పూజారి తాటిపాముల లక్ష్మినరసింహా లు మూసివేశారు. . గ్రహణం తీరిన తరువాత బుదవారం ఉదయం తెల్లవారుజామున సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనం కోసం దేవాలయాలను తెరవనున్నట్లు దేవస్థానం ఈవో పి. నారాయణచార్యులు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలో దేవాలయాలను మూసివేశారు.