అక్టోబర్ 2 న జరిగే విద్యార్థి నిరుద్యోగ సైరన్ ను జయప్రదంచేయండితూమాటినవీన్ రెడ్డి

Published: Friday October 01, 2021

మధిర, సెప్టెంబర్ 30, ప్రజాపాలన ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవి కుమార్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగినది ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి  మరియు తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గార్లు తలపెట్టిన అక్టోబర్ 2న హైదరాబాదులో విద్యార్థి నిరుద్యోగ సైరన్ కార్యక్రమం. దిల్ శుక్ నగర్ రాజీవ్ చౌక్ నుండి ఎల్బీనగర్ శ్రీకాంతాచారి చౌరస్తా వరకు పాదయాత్ర కలదు, అనంతరం విద్యార్థి నిరుద్యోగ సమస్యలపైన సభ కార్యక్రమం కలదు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క గారు పాల్గొనడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి మధిర నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.