మార్పు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సాయంమధిర నవంబర్ 9 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ

Published: Thursday November 10, 2022
11000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత.మానవత్వంతో ఆపదలో ఉన్న వారికి సహాయం  చేస్తూ సంతృప్తిగా జీవించడానికి ప్రయత్నం చేయాలని మార్పు స్వచ్ఛంధ సంస్థ సహాయ కార్యదర్శి కోయ్యల అరుణ అన్నారు. బుధవారం విజయవాడలోని ప్రవీణ్ హాస్పిటల్ నందు గుండెపోటు, కిడ్నీ వ్యాధులకు చికిత్స పొందుతున్న మధిర వాస్తవ్యులు నండ్రు దుర్గారావు వైద్య ఖర్చుల నిమిత్తం  మార్పు స్వచ్ఛంద సంస్థ ద్వారా 11000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నండ్రు దుర్గారావు భార్యా రత్తమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా కోయ్యల అరుణ మాట్లాడుతూ నండ్రు దుర్గారావు (గురుస్వామి) వైద్యానికి 5 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్స్ తెలిపారని అన్నారు. రోజు కూలి చేసుకుని జీవనం సాగిస్తున్న నిరుపేద నండ్రు దుర్గారావు కుటుంబానికి వైద్య ఖర్చులను భరించే స్తోమత లేదని అన్నారు. దాతలు ఆర్థిక సహాయం చేసి తన భర్తను బ్రతికించాలని భార్య రత్తమ్మ వేడుకుంటుందని, ఆర్థిక  సహాయం చేసే వారు ఈ నెంబర్ కు 9052266268  ఫోన్ పే చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంధ సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, సహాయ కార్యదర్శి కోయ్యల అరుణ, సభ్యులు ఆవునూరి వెంకట్రావమ్మ, ఆవునూరి వెంకట రమణ, నండ్రు రత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.