ఉపాధ్యాయుడు అమరా సత్యనారాయణ ఆకస్మిక మృతి
Published: Friday May 20, 2022
మధిర మే 19 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు
. అమరు సత్యనారాయణ కి శ్రద్ధాంజలి ఘటించిన పి ఆర్ టి యు టి ఎస్ మధిర మండల శాఖ.మధిర సుందరయ్య నగర్ లో నివాసం ఉంటూ ,కృష్ణా జిల్లా దుందిరాల పాడు ప్రాధమికపాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సత్యనారాయణ ఈ రోజు ఉదయం తను కట్టుకుంటున్న నూతన గృహం గోడకూలి ఆకస్మికంగా మృతి చెందడం పట్ల పి ఆర్ టి యు మధిర మండల శాఖ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సత్యనారాయణ కి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేసారు అమరు. సత్యనారాయణ భార్య సమత మధిర మండలం జిలుగుమాడు ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్ గా పనిచేస్తున్నారు.వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.సత్యనారాయణ స్వస్థలం కృష్ణా జిల్లా జయంతి.వారు గత 20 సంవత్సరాలుగా మధిరలో నివాసం ఉంటున్నారు.
Share this on your social network: