అయ్యప్ప స్వామి మహా పడి పూజకు హాజరైన సబితా రెడ్డి

Published: Monday November 29, 2021
బాలాపూర్, నవంబర్ 28, ప్రజాపాలన (ప్రతినిధి) : ఆదివారం బాలాపూర్ గవర్నమెంట్ పాఠశాల లోని హరికిషన్,శ్రీకాంత్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి 18 వ పడి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో పాటు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ కలిసి అయ్యప్ప స్వామి మహా పడిపూజ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వంగేటి ప్రభాకర్ రెడ్డి, బండారి మనోహర్, అర్జున్, నాయకులు జంగయ్య, జైహింద్, శ్రీనివాస్ రెడ్డి, శేఖర్, నరసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, శశి, బాల్రాజ్, నరహరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.