టిబిఎస్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా కుమ్మరి మల్లయ్య

Published: Tuesday November 29, 2022
మంచిర్యాల టౌన్, నవంబర్ 28, ప్రజాపాలన:
తెలంగాణ బలహీన వర్గాల సంక్షేమ సంఘం టిబిఎస్ఎస్ రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షుడిగా నేతకాని సంఘం అధ్యక్షుడు, సింగరేణి రిటైర్డ్ కార్మికుల సంఘం అధ్యక్షుడుగా అనేక ఉద్యమాలు చేసిన కుమ్మరి మల్లయ్య ను   నియమించినట్లు సంఘం అధ్యక్షుడు, న్యాయవాది మోతె రాజలింగు తెలిపారు.ఈ మేరకు సోమవారం మల్లయ్య కు నియామక ఉత్తర్వులు అందజేశారు. అనంతరం రాజలింగు మాట్లాడారు. బలహీనవర్గాల హక్కుల పరిరక్షణకు సంఘం కృషి చేయాలని, వారి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అభివృద్ధి కొరకు కృషి చేయాలని అన్నారు.