ఆర్థిక సాయం అందజేత

Published: Wednesday May 05, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో సోమవారం మృతి చెందిన బట్టు వీరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఫైళ్ల ఫౌండేషన్ ద్వారా 5 వేల రూపాయలను ఎంపిటిసి తుమ్మల వెంకట్ రెడ్డి చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుండు శేఖర్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలిమినేటి సత్యనారాయణ మండల నాయకులు బట్టు సాయి, మాసంపల్లి శ్రీరాములు, గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పుల స్వామి, కార్యదర్శి బట్టు నవీన్, లక్ష్మణ్, మాసంపల్లి సత్యనారాయణ, పావిరాల యాదయ్య, మునగాల ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.