మధిర రైల్వే స్టేషన్లోకోణార్క్ రైల్లో గంజాయి పట్టివేత

Published: Monday March 13, 2023
మధిర మార్చి12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఎక్సైజ్ పోలీసులు దాడులు పట్టుబడ్డ గంజాయి పట్టివేతమధిర రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం బొంబాయి నుంచి భువనేశ్వర్ వెళుతున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో 65 కేజీల ఎండు గంజాయిని ఎక్సైజ్ పోలీసులు జి ఆర్ పి కలిసి పట్టుకున్నారు. మధిర రైల్వే స్టేషన్ లో కోణార్క్ రైల్లో ఎక్సైజ్ పోలీసులు జనరల్ బోగీని తనిఖీ చేస్తుండగా భోగిలోంచి గంజాయి బ్యాగులు రైల్వే ట్రాక్ పై నిందితులు విసిరివేసి పారిపోయారు. 65 కిలోల ఎండు గంజాయి బ్యాగులను ఎక్సైజ్ పోలీసుల స్వాధీనం చేసుకొన్నారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎక్సైజ్ సి ఏ నాగేశ్వరావు వెల్లడి చేశారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ జి ఆర్ పి ఎఫ్ పోలీస్ పాల్గొన్నారు