ఏపీ సంపత్ క్రాంతి ఎక్స్ ప్రెస్ ను ప్రతిరోజు నడపాలి
Published: Saturday May 21, 2022
వ్యాపార సంస్థ ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్ విజ్ఞప్తి
బెల్లంపల్లి మే 20 ప్రజా పాలన ప్రతినిధి:. ఏపీ సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ రైలును, వారంలో రెండు రోజులు కాకుండా, ప్రతీ రోజు నడపాలని, అలాగే దక్షన్, జి టి, కేరళ, తమిళనాడు, నవజీవన్, వంటి సూపర్ ఫాస్ట్ రైళ్లను కూడా బెల్లంపల్లిలో ఆపాలని బెల్లంపల్లి మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్ దక్షిణ మధ్య రైల్వే జీఎం కు గురువారం పంపిన విజ్ఞాపన పత్రంలో ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పత్రికలవారితో ఆయన మాట్లాడుతూ
తెలంగాణ ఎంపీ లు, కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి ప్రజలకు జరిగే అసౌకర్యాలను వారితో చర్చించి, దక్షిన్, గ్రాండ్ ట్రంక్ , కేరళ, నవజీవన్, తమిళనాడు, సూపర్ ఫాస్ట్ రైళ్లను, బెల్లంపల్లి లో నిలిపేందుకు కృషిచేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Share this on your social network: