మేడ్చల్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధిగా కొల్లు బాలరాజు

Published: Thursday July 01, 2021
మేడిపల్లి, జూన్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) : మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధిగా ఉప్పలకు చెందిన కొల్లు బాలరాజు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు జె వి ఎన్ మంగెష్ కుమార్ మేడ్చల్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధిగా కొల్లు బాలరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కొల్లు బాలరాజు మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలను అందర్నీ కలుపుక పోతూ బీజేపీ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో ఈ పదవిలో నియమించినందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు హరీష్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుులు జె వి ఎన్ మంగెష్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు గోరిగే కృష్ణ, శమీర్ పేట ధర్మారెడ్డి, మహంకాళి లక్ష్మణ్ ముదిరాజ్, గొంగులూరి శ్రీనివాస శర్మ, ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ రావుల బాలకృష్ణ గౌడ్, బొంగు రమేష్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు రెడ్డిగారి దేవేందర్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలియజేశారు.