ఇబ్రహీంపట్నం చెరువు నిండి అలుగు ఎళ్ళడంతో గంగమ్మ తల్లి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి

Published: Monday October 10, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 9ప్రజాపాలన ప్రతినిధి

భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జక్క రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు 46 సంవత్సరాల తర్వాత ఆ గంగమ్మ తల్లి అలుగు వెళ్లడంతో అక్కడ ప్రత్యేక పూజలు చేయడం జరిగింది   ఈ పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు పాపయ్య గౌడ్ , రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు పోరెడ్డి నరసింహారెడ్డి  ముత్యాల భాస్కర్ , కేంద్ర సెన్సార్ బోర్డు మెంబర్ బోసు పల్లి ప్రతాప్ , జిల్లా ప్రధాన కార్యదర్శులు పోరెడ్డి అర్జున్ రెడ్డి , ఇబ్రహీంపట్నం భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ కొత్త అశోక్ గౌడ్ , స్థానిక కౌన్సిలర్ నాయని సత్యనారాయణ,మరియు గత మూడు రోజులుగా మత్స్యకారుల జరుగుతున్న అన్యాయానికి మద్దతు తెలుపుతూ చిన్న తూము నుండి నీరు వదలడాన్ని ఖండిస్తూ మొన్న ఇబ్రహీంపట్నం కమిషనర్ తో మాట్లాడటం జరిగింది మరియు పోలీసు వారిని మత్స్యకారులకు ఆధ్వర్యంలో కలిసి ఈ సమస్యను తెలియజేయడం జరిగింది,ఇకపైన మత్స్యకారులకి భారతీయ జనతా పార్టీ మరియు కిసాన్ మోర్చా ఎప్పుడు వాళ్ళ తోడు ఉంటూ వాళ్లకు న్యాయం అయ్యేంతవరకు పోరాడుతూనే ఉంటుంది ,అదేవిధంగా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముప్పాల శాంతి కుమార్ , మున్సిపాలిటీ అధ్యక్షులు బూడిద నర్సింహారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు గణేష్ మరియు విష్ణువర్ధన్ రెడ్డి దొండ రమణారెడ్డి, కాళిదాస్ తాళ్ల వెంకటేష్ గౌడ్, యువమోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు జిట్టా శ్రీనివాస్ రెడ్డి, యువమోర్చా ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు శేఖర్ రెడ్డి  శ్రీకాంత్  తదితర గ్రామాల ప్రజలు అక్కడికి విచ్చేసినటువంటి పర్యాటకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.