పలు కుటుంబాలను పరామర్శించిన జిల్లా నాయకులు డా.కోట రాంబాబు

Published: Saturday March 04, 2023
బోనకల్, మార్చి 3 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని ప్రముఖ వైద్యులు, జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు శుక్రవారం పలు కుటుంబాలను పరామర్శించారు.
ముందుగాబోనకల్ లోని అంతోటి బసవయ్య అకాల మరణం పొందగా వారి మృతదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి వారికి ఆర్థిక సహాయం అందించారు.అనంతరం గోవిందాపురం(ఎల్) గ్రామంలో షేక్ జానీ గుండెపోటుతో మరణించగా వారి మృతదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉమ్మినేని కృష్ణ , బోనకల్ గ్రామ సర్పంచ్ భూక్యా సైదా నాయక్, గోవిందాపురం గ్రామ సర్పంచ్ ఉమ్మినేని బాబు, బోనకల్ ఉపసర్పంచ్ యార్లగడ్డ రాఘవ , కోయినేని ప్రదీప్ , తమ్మరపు బ్రహ్మం, కళ్యాణపు నాగేశ్వరరావు , ధారగాని నారాయణ , బంధం తిరుపతిరావు, మల్లా చారి , ధర్మపురి కృష్ణ , చింతలచెర్వు లక్ష్మీనారాయణ , చక్కెర సాహెబ్, అంతోటి ముత్తయ్య, మోర్ల ఆంజనేయులు, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.