15 వార్డులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

Published: Monday June 20, 2022

మధిర  జూన్ 19 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాల్టీ పరిధిలో ఆదివారం నాడు పట్టణంలోని 15 వార్డులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు ఆ వార్డు కౌన్సిలర్ కోన ధని కుమార్ తెలిపారు. ఆదివారం వార్డులో కొనసాగుతున్న పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజీలో పేరుకుపోయిన మురుగును రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా కూలీలను తీసుకొని వచ్చి తొలగించడం జరిగిందని ఆయన తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వార్డులో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే వారిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు స్థానిక శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క సహకారంతో వార్డులో ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న ట్లు ఆయన తెలిపారు