ఉత్తమ విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే

Published: Thursday July 07, 2022
బెల్లంపల్లి జూలై 6 ప్రజా పాలన ప్రతినిధి:బెల్లంపల్లి పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి పరీక్ష ఫలితాలలో అత్యధిక జీపీఎ 10/10 సాధించిన దుర్గం జయశ్రీ, కుశన పెళ్లి ఆర్య వర్షిత్, మరియు మడిపెద్ది సంజన, ముగ్గురు విద్యార్థులను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇదేవిధంగా పై చదువుల్లో కూడా రాణించి, బెల్లంపల్లి పట్టణానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని,  ఉన్నత పదవుల్లో ఉండాలని, ఆకాంక్షించారు.
 ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు ఏలూరి వెంకటేశం, పాఠశాల డైరెక్టర్లు ఇ. రవి ప్రసాద్ గారు, ప్రధానోపాధ్యాయులు యం. రాజా రమేష్ మరియు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.