ఏఐయుడబ్ల్యుసి జిల్లా కో ఆర్డినేటర్ గా ఏల్పుల రోహిత్.
Published: Thursday November 11, 2021
బెల్లంపల్లి నవంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి : అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అసంఘటిత కార్మికుల మంచిర్యాల జిల్లా కోఆర్డినేటర్ గా బెల్లంపల్లికి చెందిన వేల్పుల రోహిత్ ను నియమించినట్లు ఏ ఐ యు డబ్ల్యు సి జాతీయ చైర్మన్ అర్బింద్ సింగ్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రోహిత్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి రావడానికి సహకరించిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ఏ ఐ యుడబ్ల్యూ సి, నేషనల్ చైర్మన్ ఆర్భింధ్ సింగ్ కి, రాష్ట్ర చైర్మన్ లక్ష్మణ్, వేణుకి, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి, ఏఐసిసి సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకి, డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖాప్రేమ్ సాగర్ రావు కి, టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రెటరి ఎం.డి ముజాహిద్ కి, టిపిసిసి సభ్యులు చిలుముల శంకర్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Share this on your social network: