18న టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) మహాసభ ను జయప్రదం చేయండి
Published: Thursday December 15, 2022
తల్లాడ, డిసెంబర్ 14 (ప్రజాపాలన న్యూస్):
జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారం లో ముందుండి పోరాడే టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) నాయకత్వమే జర్నలిస్ట్ లకు అండ అని జిల్లా ఉపాధ్యక్షులు తోట కిరణ్ అన్నారు. బుదవారం తల్లాడ లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడిపల్లి నారాయణ అధ్యక్షతన జరిగిన జిల్లా మహాసభల సన్నాక సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ ల సంక్షేమమే లక్ష్యంగా తమ యూనియన్ పనిచేస్తుందన్నారు. యూనియన్ సభ్యత్వం తో రూ.2 లక్షల ప్రమాద బీమా అందజేస్తున్నట్లు తెలిపారు. హెల్త్ కార్డులు, రెట్టింపు సంఖ్యలో అక్రిడిటేషన్ ల మంజూరు, కరోనా సోకిన జర్నలిస్ట్ లకు చేయూత వంటి యూనియన్ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. తల్లాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ ఈ నెల 18 న జరగనున్న యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దుగ్గిదేవర అజయ్ కుమార్ జర్నలిస్టులు ఎం.డి ముస్తఫా, జంపాల రమణ, తాళ్లూరి దర్గయ్య, మోదుగు జయరాజు, జి. బాబురావు, రుద్రాక్షల నరసింహచారి, పున్నం శ్రీనివాసరావు, కరుణాకర్, రాంబాబు, యాకూబ్, విజయ్, ఇస్నపల్లి శ్రీనివాస్, మేహరాజ్ (రోబో), బి. శ్రీను, జి. శ్రీనివాసరావు, పి.వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: