ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ కి ఘనంగా వీడ్కోలు శంకరపట్నం జనవరి 30 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Tuesday January 31, 2023

శంకరపట్నం మండలం మక్త ప్రాథమిక పాఠశాలలో సోమవారం గ్రామ సర్పంచ్ సుష్మా మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) పదవీ విరమణ ఘనంగా నిర్వహించారు.  మక్త ప్రాథమిక పాఠశాలలో గత 40 సంవత్సరాలుగా ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ గా సేవలందిస్తున్న మొలంగూర్ గ్రామానికి చెందిన పూదరి పోచయ్య రేపటితో తన పదవీకాలం ముగిస్తుండగా  సోమవారం ఆయనకు పాఠశాల విద్యార్థులు గ్రామస్తులు పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతోపాటు గ్రామస్తులు ఉద్వేగానికి లోనయ్యారు. 40 సంవత్సరాలుగా ఎంతోమంది గ్రామస్తులు ఆ పాఠశాలనే చదువుకొని ఉన్నత స్థాయిలకు ఎదిగారు, గ్రామ సర్పంచ్ భర్త మహేష్ కూడా అదే పాఠశాలలో చదువుకొని ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. నాలుగు దశాబ్దాలుగా సేవలందించి ఎంతో మంచి పేరు సంపాదించుకొని అందరితో కలివిడిగా ఉంటూ గ్రామస్తులలో ఒకరిగా ఉన్నటువంటి పూదరి పోచయ్య సాగనంపుతూ విద్యార్థులు గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల ఉపాధ్యాయులు ఎంఏ ఖాద్రి,  ప్రసాద్,  మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్, సంజీవరెడ్డి, కేశవపట్నం ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ మమతా గౌతమి,  మొలంగూర్ హెచ్ఎం రోజా రమణి, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.