ఇండియన్ టాలెంట్ టెస్ట్ లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన మధిర భరత్ విద్యార్థులు
Published: Saturday July 09, 2022
మధిర జూలై 8 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు మున్సిపాలిటీ చెందిన భరత్ టెక్నో స్కూల్ విద్యార్థులు ఇటీవల నిర్వహించిన ఇండియన్ టాలెంట్ టెస్టులో స్టేట్ 7వ ర్యాంకు,14 ర్యాంకు సాధించడం జరిగిందని భారత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుక్రవారం నాడు పాఠశాలలో ప్రశంసా పత్రం,మేమంటోలని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జింకల కోటేశ్వరరావు,రవీందర్ రెడ్డి,నాగరాజు,అజిమ్, భవాని,ప్రియాంక,త్రివేణి,పావని,రాజు,సుధాకర్,రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: