జాతీయ జెండాను ఎగురవేసిన కార్పొరేటర్ యుగేంధర్ రెడ్డి
Published: Monday August 16, 2021
మేడిపల్లి, ఆగస్టు15 (ప్రజాపాలన ప్రతినిధి) : 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మద్ది యుగేంధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డివిజన్లోని రోడ్డు నంబర్ 4 జెండా ప్రాంగణం వద్ద నిర్వహించిన స్వాతంత్ర్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీటీసీ బొందుగుల కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, అమర్ సింగ్ లు పాల్గొని కార్పొరేటర్ మద్ది యుగేంధర్ రెడ్డితో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. జాతీయ జెండాకు వందనాలు సమర్పిస్తూ, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, డివిజన్ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: