టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ పై వ్యాఖ్యలను ఖండిస్తున్నాం బూర్గంపాడు మండల కాంగ్ర

Published: Saturday December 24, 2022
నైతిక విలువలు కలిగిన వ్యక్తిత్వం అయన నైజం
ఒకే పార్టీ, ఒకే మాట, అధిష్టానం చెప్పిన పని తుచతప్పకుండ చేయడం
ప్రజాక్షేత్రం లో ఉండటం అయన జీవితం
 ఈరోజు బూర్గంపాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మండల ప్రధాన కార్యదర్శి చల్ల వెంకటనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ 30 "సం" నుండి ఒకే పార్టీ లో నీకార్సయినా దమ్మున్న లీడర్ టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గ ప్రసాద్ ను హేళనగా మాట్లాడటం, అడుగులకు మడుగులు వొత్తడం అని మణుగూరు నాయకులు గోపి అనడం హాస్యాస్పదం గా చాలా విడ్డురంగా వుంది పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మండలం నుంచి కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి పార్టీ ఎన్నో పదవుల ద్వారా గౌరవిస్తూ వస్తుంది. అయన చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ గా వున్నప్పుడు కళ్ళు మొక్కి,దండాలు పెట్టి ఆపేరు చెప్పుకొని అక్కడ తాళదాచుకున్న  రోజులు మర్చిపోయారా, వారి ద్వారా అప్పటి మంత్రి వనమా గారినీ పరిచయం చేసుకొని ఆ పేరు వాడుకొని ఉద్యోగాలు, లోన్స్ ఇప్పిస్తా అని చెప్పి వసూలు చేసి 10 సవత్సరాలు ఎక్కడ ఉన్నవో తెలియకుండా పోయి మళ్ళీ 2019 నా జిల్లా అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరన్న ఇంటిదగ్గర ప్రత్యేక్షమై పరిచయం చేయమని గేటు బయట నిలబడి దుర్గన్న కాళ్ళు ఓత్తి,పట్టుకొని,బ్రతిమిలాడిన రోజులు మర్చిపోయావా అలా బ్రతిమిలాడి మండల అధ్యక్షులు పదవి తెచ్చుకుంది కూడా గుర్తు లేనట్టు నటించడం,పూటకోక పార్టీ, ఊరు మార్చే నువ్వు ఇలా మాట్లాడటం నీకేసాధ్యం ఇప్పటికైనా నీ స్థాయి, నీ పూర్వలు అన్ని ఒకసారి వెన్నకి తిరిగి చూసుకొని మాట్లాడితే మంచిది లేకపోతె కాంగ్రెస్ కార్యకర్తలు,దుర్గన్న అభిమానులు నీన్ను తరిమి తరిమి కొడతాం అని హెచ్చరిస్తున్నాం. ఈకార్యక్రమంలోపినపాక బీ-బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, మహిళా వర్కింగ్ భాగి వెంకట్రావు, మహిళా ప్రెసిడెంట్ మైపా మణి, రెడ్డమ్మ,మండల నాయకులు కువ్వారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు