అత్వెల్లి గ్రామ వైకుంఠ ధామానానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి

Published: Tuesday June 14, 2022
వికారాబాద్ ఎంపిడిఓ మల్గ సత్తయ్య
వికారాబాద్ బ్యూరో జూన్ 13 ప్రజా పాలన : అత్వెల్లి గ్రామ వైకుంఠ ధామానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని సర్పంచ్ మోహన్ కు వికారాబాద్ ఎంపిడిఓ మల్గ సత్తయ్య సూచించారు. సోమవారం వికారాబాద్ మండల పరిధిలోని అత్వెల్లి గ్రామాన్ని ఐదవ విడత పల్లె ప్రగతి లో భాగంగా పరిశీలించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ధామానికి విద్యుత్ కనెక్షన్ నీటి సరఫరా ఏర్పాటు చేయాలని సర్పంచ్ మోహన్ ఇన్చార్జ్ కార్యదర్శి కిషన్ రెడ్డికి సూచించారు. కంపోస్ట్ షెడ్డులో కంపోస్ట్ విధానాన్ని పర్యవేక్షించడం జరిగిందని అన్నారు. గ్రామంలో కొత్తగా వేసిన సిసి రోడ్లను ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. హరిత హారంలో నాటిన మొక్కలను మరియు ఇంకా నాటవలసిన మొక్కల కొరకు తవ్విన గుంతలను పరిశీలించారు. పాడుబడిన పాత  బావులపై ఫెన్సింగ్ వేశారని చెప్పారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయని అభినందించారు. సర్పంచ్ మోహన్ మరియు కార్యదర్శి కిషన్ రెడ్డిలు సమన్వయంతో పని చేస్తూ పల్లె ప్రగతి కార్యక్రమాలను రోజువారీగా పూర్తి చేస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఏపీఎం లక్ష్మణ్, ఏ.పి.ఒ శ్రీనివాసులు పాల్గొన్నారు.