* యాలాలలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా * మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తున్న దందా

Published: Saturday January 28, 2023
 అధికారుల అండ దండలతో ఇసుక దందా 
 
వికారాబాద్ బ్యూరో 27 జనవరి ప్రజాపాలన : యాలాల మండల పరిధిలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అందులో భాగంగానే ఇసుక తెల్లవారి కల్లా కుప్పలు తెప్పలుగా ఏర్పడుతుంది .యాలాలలో రాత్రి వేళలో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఇసుక అక్రమంగా తరలించి ఇసుక మాఫియా సొమ్ము చేసుకుంటున్న పట్టించుకునే నాధుడు లేడు. ఇసుక మాఫియాకు అధికారుల అండదండలు పూర్తిగా ఉండడం వల్ల మమ్మల్ని ఎవరు ఏం చేయలేరులే అంటూ మూడు పువ్వులు ఆరు కాయలుగా వారి వ్యాపారం  కొనసాగిస్తున్నారు. ఇసుక వ్యాపారంలో అధికారుల హస్తం ఉన్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం నియంత్రించాల్సింది పోయి వారికి ప్రోత్సహించడం జరుగుతుంది. అడ్డుకునే వారిపై అవసరమైతే ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గురువారం రాత్రి ఇసుక క్రమంగా తరలించి యాలాల మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో ఇసుక డంపింగ్ ఏర్పాటు చేశారు. ఇది అధికారుల సహకారం లేకుంటే సాధ్యం కాదు. ఇప్పటికైనా అదికారులు స్పందించి ఇసుక మాఫియా ను అరికట్టాలని  ప్రజలు కోరుతున్నారు.