ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం

Published: Wednesday February 17, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 16 ( ప్రజాపాలన ) : క్రమశిక్షణతో పని చేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మండలానికి చెందిన సిద్దులూరు, కొటాలగూడ, పులుసుమామిడి, పీరంపల్లి, పాతూర్, కామారెడ్డి గూడ, బురాన్ పల్లి గ్రామాలలో గులాబి భరోసా కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇంచార్జ్ జహాంగిర్ నేతృత్వంలో పార్టీ సభ్యత్వం, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు నారెగూడెం కమాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పార్టీ ప్రతష్ఠకు కార్యకర్తలే వెన్నెముకలుగా ఉంటారని తెలిపారు. ప్రతి కార్యకర్త సాధారణ సభ్యత్వం 30, క్రియాశీల కార్యకర్త 100 రూపాయల చొప్పున సభ్యత్వం చేయాలని సూచించారు. మనకు ఇచ్చిన 50 వేల లక్ష్యాన్ని ప్రతి ఒక్కరం కలిసికట్టుగా సమన్వయంతో కృషి చేస్తే పూర్తి చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కొనసాగటానికి ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీని బలోపేతం చేయాలన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రెండు లక్షల బీమా సౌకర్యం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు బంటు ఆంజనేయులు ముదిరాజ్, రాములునాయక్, జయమ్మ నరేందర్ రెడ్డి, నారెగూడెం కమాల్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, మమత సాయిక్రిష్ణ, శివారెడ్డిపేట్ పిఏసిఎస్ చైర్మన్ మాసనగారి ముత్యంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాపగారి విజయ్ కుమార్, రైతుబంధు అధ్యక్షుడు వెంకటయ్య, జనరల్ సెక్రెటరీ సత్తయ్య గౌడ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.