బాయిజమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం.

Published: Wednesday January 11, 2023
బెల్లంపల్లి జనవరి 10 ప్రజా పాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా
బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మంగళవారం మధ్యాహ్నం గర్భిణులు, బాలింతలకు, రోగులకు,  బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి తెలిపారు. 
బుధవారం దాతలు పుల్ల మంజుల, సంపత్, యం.డి సజ్జూభేగం. సీహెచ్ రామదాసుల సహకారం తో, ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రతి మంగళవారం బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గర్భిణులకు,బాలింతలకు రోగులకు,  సాయి భోజన్ అన్నదానం చేస్తున్నామని, ఈ సందర్భంగా ఆస్పత్రిలోని,  గర్భిణీలు, బాలింతలు, రోగులు  అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకునీ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రస్టు మేనేజర్ బోద్దున సతీష్, జక్కం నాగమణి, కొంక శ్రీనివాస్, ఇగురపు భాస్కర్, ఏనుగు హేమలత, విజ్జి గిరి శంకర్, చుంచుల వెంకటేష్, జక్కం శివరాం, తాటిపాముల మనీష్, డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.