వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

Published: Thursday November 10, 2022

కొడిమ్యాల, నవంబర్ 09 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మెన్నెని రాజా నర్సింగరావు  మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావుతో కలిపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నాచుపల్లి సర్పంచ్ అంబాటి లత తిరుమలేష్ .వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్. సహకార  దత్తత అధికారి అశోక్ కుమార్. అగ్రికల్చర్ ఏ ఈ ఓ మంజుల .వివిధ గ్రామాల సర్పంచులు. ఎంపీటీసీలు. సింగల్ విండో డైరెక్టర్లు. సీఈఓ వోడ్నాల గంగాధర్. రైతులు. తదితరులు పాల్గొన్నారు.