అదివాసి గిరిజనులకు స్వేటర్ల పంపిణీ

Published: Thursday December 16, 2021
జన్నారం రూరల్, డిసెంబర్ 15, ప్రజపాలన ప్రతినిధి : మండలంలోని మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామం రాయికుంటలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మదుయాష్కీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆ గ్రామ గిరిజనులకు ఎఐసిసి రిసెర్చ్ డిపార్ట్మెంట్ తెలంగాణ కో-అర్డినేటర్ వినోద్ నాయక్ అదర్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు బుధవారం స్వేటర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అద్యయక్షుడు బోర్లకుంట ప్రభుదాస్,  నాయకులు సోహైల్, బన్నీ, సురేష్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.