ఐటిఐ ని అద్దె బవనం నుంచి తొలగించాలి.

Published: Thursday December 16, 2021
జన్నారం రూరల్, డిసెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రం లోని ఐటిఐ కాలశాలను అద్దె బవనంలో నుంచి  ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నికి మార్చాలని కోరుతూ రాష్టా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రరేడ్డికి జన్నారం జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ వినతిపత్రం అందజేశారు. బుధవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి మండలం లోని పలు విద్యాసంస్థలకు సంబంధించిన అభివృద్ధి పై వివరించారు. ఈ సందర్భంగా అద్దె బవనంలో ఐటిఐ కళాశాల నిర్వాహలో తలెత్తుతున్న సమస్యలను వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని , జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని జడ్పీటీసీ తెలిపారు.