అభివృద్ధి పనులపై కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు అధికారులతో సమీక్షి సమావేశం

Published: Tuesday November 23, 2021
మేడిపల్లి, నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) పలు అభివృద్ధి పనులపై రామంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు ఉప్పల్ జిహెచ్ఎంసి కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డివిజన్లో అభివృద్ధి పనులు మరియు పెండింగ్ పనులు రోడ్ వర్క్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, స్ట్రామ్ వాటర్ పనులు, ఎక్కడైతే అభివృద్ధికి నోచుకోని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కార్పొరేటర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మున్సిపల్ ఈఈ నాగేందర్, ఏఈ విగ్నేశ్వరీ, కాంట్రాక్టర్లు, డివిజన్ అధ్యక్షులు బండారు వెంకటరావు, ప్రధాన కార్యదర్శులు సంకూరీ కుమారస్వామి, ఉలుగొండ నారాయణదాసు, బీజేవైఎం రామంతపూర్ డివిజన్ అధ్యక్షులు పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి, సతీష్ గుప్తా తదితరుులు పాల్గొన్నారు.