జర్నలిస్టు లకు ఇండ్ల స్థలాలు ఇవ్వండి. .. జిల్లా కలెక్టర్ ను కలిసిన తాండూర్ పాత్రికేయులు

Published: Tuesday March 07, 2023
మంచిర్యాల బ్యూరో, మార్చి 06, ప్రజాపాలన:
 
జర్నలిస్టు లకు ఇండ్ల స్థలాలు కేటాయించి, ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వ సహాయం అందించాలని కోరుతూ తాండూర్ పాత్రికేయులు సోమవారం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా తాండూర్ క్లబ్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా సమాచారం సేకరించి, చేరవేస్తున్న జర్నలిస్టులు స్వంత ఇల్లు లేక అద్దె ఇండ్లలో అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.  గత కొన్ని సంవత్సరాలుగా  త పత్రికలలో పని చేస్తూ  ప్రజా సమస్యలపై  అనేక వార్తలు రాస్తూ  ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు  ప్రభుత్వానికి  అధికారులకు తెలియజేస్తూ పాత్రికేయులు వృత్తి పరంగా  కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నామన్నారు.గతంలో మండలానికి చెందిన కొంతమంది పాత్రికేయులకు  ఇండ్ల స్థలాలకు భూమి కేటాయించారని, లబ్ది దారులను గుర్తించి అర్హులైన తమకు కూడా ఇండ్ల స్థలాలు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో

 పాత్రికేయులు దుద్దిల్ల రామ్మోహన్ ,
ఈర్ల శ్రీనివాస్ ,అసం అశోక్ ,సిద్ధంసేటి పవన్ కుమార్, మీనుగు సూర్య ప్రకాష్,
శనిగారపూ వినోద్ ,కొడిమల శ్రీకాంత్ ,
మోర్ల జెనార్ధన్  తదితరులు పాల్గొన్నారు.