డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

Published: Wednesday July 07, 2021
బాలాపూర్, జులై 06, ప్రజాపాలన ప్రతినిధి : దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు అని కొనియాడారు బిజెపి సీనియర్ నాయకులు మాజీ సింగిల్విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జి జయంతి సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంగళవారం నాడు బి ఎం సి జనరల్ సెక్రటరీ జోరాల ప్రభాకర్  అధ్యక్షతన జరిగిన బాలాపూర్ లో చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కోలన్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ..... ఏక్ దేశ్ మే దో విదాన్, దో ప్రధాన్ ధో నీషాన్ నహి చలేంగే అని నినదించి, సమున్నత సమైక్య భారత కోసం పోరాటం చేసిన మహోన్నత దేశభక్తుడని అన్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగల్ విండో చైర్మన్ కొలను శంకర్ రెడ్డి, జిల్లా నాయకులు మద్ది రాజశేఖర్, బ్యాంక్ డైరెక్టర్లు కళ్లెం లక్ష్మారెడ్డి, కొంతం సంపత్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు దొడ్డి శ్రీశైలం, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నవారు శ్రీనివాస్ రెడ్డి కొంతం ప్రకాష్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.