మాజీ మండల పరిషత్ అద్యక్షుడు గాజుల శంకరయ్య సంస్మరణ సభ శంకరపట్నం ఫిబ్రవరి 09 ప్రజాపాలన రిపోర్ట
శంకరపట్నం మండల కేంద్రంలో శంకరపట్నం మండల ప్రథమ ఎంపిపి, గాజుల శంకరయ్య 31వ వర్ధంతి పురస్కరించుకొని పద్మశాలి సంఘం అధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మాజీ సర్పంచ్, మాజీ మొదటి మండల పరిషత్ అధ్యక్షులు గాజుల శంకరయ్య గారి సేవలు మరువలేనివని, శంకరయ్య ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు, శంకరపట్నం మండల పరిషత్ అధ్యక్షులు ప్రథమ అధ్యక్షులుగా, కేశవపట్నం గ్రామ సర్పంచ్ గా పని చేశారని గుర్తుచేసుకున్నారు.
మండల కార్యాలయాలు, పోలీస్ స్టేషన్, బస్ స్టాండ్ నిర్మాణాలకు కృషి చేశారు, పేద వర్గాల కోసం పని చేశారు, ప్రజా సేవలో ఉండగా కొన్ని డిమాండ్ల కోసం నక్సల్స్ వారిని కిడ్నాప్ చేసి, చివరకు ప్రభుత్వం దిగి రాకపోతే నక్సల్స్ కాల్పుల్లో హతమైనారు, అట్టి నాయకుని పేరున మండలం పేరును శంకరపట్నంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి, వారిని గౌరవించిందని గుర్తు చేసుకున్నారు, వారి విగ్రహాన్ని మండలంలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జక్కని సంజయ్ కుమార్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు మెతుకు సత్యం, ఐఏఎస్ అధికారి నరహరి సోదరుడు పరికిపండ్ల రామ్, మాజీ ఎంపీటీసీ గుర్రం రామస్వామి, పద్మశాలి సంఘం కరీంనగర్ పట్టణ అధ్యక్షుడు గడ్డం శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బస్మయ్య గౌడ్, టీడీపీ మండల అధ్యక్షుడు ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: