అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన పాస్టర్ మేకల ప్రసాదరావు.. తల్లాడ, ఏప్రిల్ 9 (ప్రజా పాలన న

Published: Monday April 10, 2023

యేసుక్రీస్తు పునరుద్దాన పండుగ (ఈస్టర్) సందర్భంగా తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో బాప్టిస్ట్ చర్చి వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కోశాధికారి పాస్టర్ మేకల ప్రసాద్ రావు ప్రారంభించారు. తొలుత చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సుమారు 800 మందికిపైగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫాస్టర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు మరణించి మూడోరోజు పునరుద్దానుడై లేసిన సందర్భంగా పండుగను జరుపుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు సూచించిన ప్రేమ, శాంతి మార్గంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు పాస్టర్ సుధాకర్, యెహోషువ, ఇమ్మానుయేలు, సంఘపెద్దలు పాల్గొన్నారు.*