లాలాగూడ కాలనీ వాసులకు తాగు నీరందించడమే లక్ష్యం

Published: Monday August 23, 2021
మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 22 ఆగస్ట్ ప్రజాపాలన : లాలాగూడ కాలనీవాసుల తాగునీటి సమస్యను తీర్చడానికి కృషి చేస్తున్నామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ల పల్లి మంజుల రమేష్ అన్నారు. ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు కౌన్సిలర్ చిట్యాల అనంత రెడ్డి ఆధ్వర్యంలో పైప్ లైన్ నిర్మాణ పనులకు పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. లాలాగూడలో రూ.3.30 లక్షల వ్యయంతో నీటి సరఫరా పైపులైను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మేక పావని, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, శివారెడ్డిపేట్ పిఏసిఎస్ చైర్మన్ మసనగారి ముత్యంరెడ్డి, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యలు షకీల్ తదితరులు పాల్గొన్నారు.