మొలుగు శ్రీకాంత్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

Published: Monday January 24, 2022

రాయికల్, జనవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ పట్టణంలో మూడు బొమ్మల చౌరస్తాలో పరాక్రమ్ దివస్, సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొలుగు శ్రీకాంత్, సాగర్, శ్రీకాంత్, హరిచందన్, విజయ్, వివేక్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు