యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన బాబా షరీఫ్

Published: Thursday November 10, 2022
చౌటుప్పల్ నవంబర్ 9 (ప్రజాపాలన ప్రతినిధి): రోజున తెలంగాణా రాష్ట్ర మున్సిపల్ కౌన్సిలర్ల రాష్ట్ర అధ్యక్షులు రాము నాయక్ చౌటుప్పల పురపాలక సంఘ కేంద్రములో జిల్లా స్థాయి మున్సిపల్ వార్డు కౌన్సిలర్ల సమావేశమును ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గా చౌటుప్పల మున్సిపాలిటీ 20వ వార్డు కౌన్సిలర్ యండి. బాబా షరీఫ్ ని నియమించి నియామక పత్రమును అందజేయడం జరిగినది. అనంతరం యండి బాబా షరీఫ్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఉన్న అన్నీ మున్సిపాలిటీ ల కౌన్సిలర్ల ను సమన్వయ పర్చుకుంటూ వారి యొక్క సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి తన -వంతు బాధ్యతగా ఎల్లవేళలా కృషి చేస్తానని అలాగే తనను ఎన్నుకున్న తన తోటి కౌన్సిలర్లకు మరియు రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి తెలంగాణా రాష్ట్ర మున్సిపల్ కౌన్సిలర్ల రాష్ట్ర అధ్యక్షులు రాము నాయక్ కి మరియు రాష్ట్ర విద్యుత్ శాఖా మాత్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డికి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్నతలు తెలియజేశారు.