విద్యుత్ షాక్ తో మృతి చెందిన గేదెకు నష్టపరిహారం...

Published: Tuesday May 18, 2021
బీరుపూర్, మే 17 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండల్ తుంగూర్ గ్రామంలో గత కొన్ని నెలల క్రితం గ్రామానికి చెందిన దోసారపు చిన్న గంగయ్యకు చెందిన గేదే విద్యుత్ షాక్ తో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుండి మంజురు అయిన 40 వేల రూపాయల చేక్కును గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ గుడిసె శ్రీమతిజితేందర్ యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో యంపీటిసి అడెపు మల్లేశ్వరితిరుపతి విద్యుత్ ఏఈ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.